
జూబ్లీహిల్స్లో అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని లిటిల్ స్టార్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్షతో అల్లాపై విశ్వాసం పెంపొందించుకోవడం, సత్యం, ధర్మ మార్గంలో నడుచుకోవడం ఈ పవిత్ర మాసం యొక్క ప్రత్యేకత అని తెలిపారు. సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడానికి ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పవిత్ర రంజాన్ మాసం ముబారక్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. అస్మత్ ఉన్నిసా మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ మాసంలో రోజా పాటిస్తూ అల్లా కరుణకు పాత్రులవుతారని చెప్పారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం తో పాటు పేదలకు సహాయం చేసే అవకాశం అల్లా ప్రసాదించాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు సురవరం రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరి కిషోర్, జూబ్లీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ ఎస్.ఎం. సదృద్దీన్, అన్వర్, బాబురావు, అజిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.