Events & Activities
Stay updated with the latest activities and events organized by NHRC.

మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
అంకిసా
2026-06-19
మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా అంకిసా మండల కేంద్రంలో జరిగిన భవ్య హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్ శర్మ, హిందూ ప్రసంగీకులు కృష్ణమోహన్, దీన్ దయాల్, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరయ్యారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.శివాజీ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు.భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు అడిగెల నగేష్, అచ్చ మురళీధర్, చామల అశోక్, చింతం రాజు, గంజి మహేష్, శ్యాంసుందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి సదానందం, మండల అధ్యక్షులు చల్లగురుగు
Read More →
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం
వెంకటాపురం/వాజేడు/ములుగు
2026-06-19
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి గొప్ప సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.వెంకటాపురం మండల అధ్యక్షులు రాయుడు జయరాజు అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగిన వాజేడు, వెంకటాపురం రెండు మండలాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని వాటినీ నిరోధించడానికి ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం లీగల్ ప్రొసీజర్ తో తమ జాతీయ మానవ హక్కుల కమిటీ తీవ్రంగా కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ, కుంట ఏడుకొండలు, పిల్లల లీలారాణి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు గాదే శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు లూర్ద్ రాజు, గుర్రం సుభాషిని, గుర్రం రాజేష్, శెట్టిపల్లి రామకృష్ణ, మంగపేట మండల ఉపాధ్యక్షులు గుడిసేవ నాగేశ్వరరావు, ములుగు వెంకటాపూర్ మండల ఉపాధ్యక్షులు పులాల రమేష్,వాజేడు, వెంకటాపురం మండలాలలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావంతులు సుమారుగా 500 మంది భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాజేడు మండల కమిటీని ప్రకటించారు. వెంకటాపురం మండల కమిటీలో స్వల్ప మార్పు చేర్పులు చేసి పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు.
Read More →
జూబ్లీహిల్స్లో అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
హైదరాబాద్
2026-06-19
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని లిటిల్ స్టార్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్షతో అల్లాపై విశ్వాసం పెంపొందించుకోవడం, సత్యం, ధర్మ మార్గంలో నడుచుకోవడం ఈ పవిత్ర మాసం యొక్క ప్రత్యేకత అని తెలిపారు. సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడానికి ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పవిత్ర రంజాన్ మాసం ముబారక్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. అస్మత్ ఉన్నిసా మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ మాసంలో రోజా పాటిస్తూ అల్లా కరుణకు పాత్రులవుతారని చెప్పారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం తో పాటు పేదలకు సహాయం చేసే అవకాశం అల్లా ప్రసాదించాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు సురవరం రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరి కిషోర్, జూబ్లీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ ఎస్.ఎం. సదృద్దీన్, అన్వర్, బాబురావు, అజిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More →
ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డిని సన్మానించిన డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్, ఉపసర్పంచులకు అభినందనలు
జగిత్యాల
2026-06-19
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ముత్యంపేట గ్రామంలో భక్తులకు సంబంధించిన సులభ కాంప్లెక్స్ సంబంధించిన బాట కబ్జాకు గురైన సందర్భంలో జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాటను పునరుద్ధరించడానికి ఒక ఏడాది కాలం పాటు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు గ్రామాన్ని సందర్శించిన సమయంలో మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దారం ఆదిరెడ్డి జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి ముందు జాతీయ మానవ హక్కుల కమిటీ నేతలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్ ఆదిరెడ్డి, ఉపసర్పంచ్ ముత్యంరెడ్డి సులభ కాంప్లెక్స్ కు సంబంధించిన బాటను పునరుద్ధరించడానికి కబ్జాకు గురైన అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూలగొట్టించారు. భక్తులకు సౌకర్యవంతంగా సులభ కాంప్లెక్స్ పరిసరాలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జగిత్యాల జిల్లా నేతలు లేవనెత్తిన సమస్యను మంత్రి సహకారంతో పరిష్కరించిన గ్రామసర్పంచ్ దారం ఆదిరెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. ఉపసర్పంచి ముత్యంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించిన వారు చరిత్రలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి సామల లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు కోల రాజేశం గౌడ్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, భూపాలపల్లి జిల్లా నాయకులు గొల్లపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More →
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు చేపట్టాలి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు జాతీయ మానవ హక్కుల కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి
వరంగల్
2026-06-19
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పూర్తి మద్దతు తెలుపుతుందని వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని,ట్రేడ్ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘాల ఎలక్షన్లు నిర్వహించాలని,సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు,కండక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఎన్నో సంవత్సరాలుగా వేతన సమస్యలు,ఉద్యోగ భద్రత లోపం,అధిక పని భారం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్మికులపై ఎలాంటి అణచివేత చర్యలు తీసుకోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జ సురేందర్, వెంకట్రాజం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్, నూనె తిలక్, నల్లబెల్లి మండల అధ్యక్షులు నాగపురి రమేష్, సంగం మండల అధ్యక్షులు బొల్లబోయిన రాజేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More →
ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకోవాలి
హైదరాబాద్
2026-06-19
ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాల ప్రకారం శక్తులుగా ఎదగాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. హైదరాబాదులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తులు శక్తులుగా ఎదిగినప్పుడే గొప్ప సమాజాన్ని నిర్మించిన వాళ్ళమవుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశ సంపద, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే మన దేశాన్ని గొప్పగా తయారు చేసుకోవచ్చని ఆయన అన్నారు. హైదరాబాద్ జిల్లాలో అన్ని కమిటీలు పూర్తిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాదు జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ స్వప్న, ఉపాధ్యక్షురాలు గల్వ సునీతారెడ్డి, నాయకులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Read More →
జాతీయ మానవ హక్కుల కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ నియామకం
వనపర్తి
2026-06-19
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వనపర్తి జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రకటించారు.రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సమి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్, ఉపాధ్యక్షులుగా జానంపేట శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంపదను ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి తమ సంస్థ లీగల్గా పేద ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన పసుపుల రవికుమార్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అన్ని మండల కమిటీలు, గ్రామ కమిటీలు పూర్తి చేసి సంస్థను బలోపేతం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read More →