
జాతీయ మానవ హక్కుల కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ నియామకం
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వనపర్తి జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రకటించారు.రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి సమి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా పసుపుల రవికుమార్, ఉపాధ్యక్షులుగా జానంపేట శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎండి అవేజ్ లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సంపదను ప్రభుత్వ ఖజానాను లూటీ చేసే అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి తమ సంస్థ లీగల్గా పేద ప్రజల కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన పసుపుల రవికుమార్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అన్ని మండల కమిటీలు, గ్రామ కమిటీలు పూర్తి చేసి సంస్థను బలోపేతం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు.